టాలీవుడ్ లో గ్లామర్ డాల్స్ కి లోటు లేదు. ప్రతీ సినిమాలో వారు కనిపిస్తూనే ఉంటారు. అందాల భామలతో ఆట పాట అన్నది కమర్షియల్ ఎలిమెంట్ కూడా. ఇక కొందరు హీరోల సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్స్ కూడా ఉంటారు.ఫుల్ గ్లామర్ డోస్ తో వెండి తెరను పండించేయాలని కూడా ఫిల్మ్  మేకర్స్ ఆలోచిస్తూంటారు. చాలా రేర్ గా మాత్రం పెర్ఫార్మెన్స్ విషయంలో టాలీవుడ్ హీరోయిన్స్ కి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇది హీరోల రాజ్యం కాబట్టి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఇద్దరు టాప్ హీరోల మూవీస్ లో మరో ఇద్దరు ముద్దు గుమ్మలు హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారని టాక్ నడుస్తోంది.

ముందుగా మహేష్ బాబుని తీసుకుంటే ఆయన గీతాగోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో సర్కార్ వారి పాట మూవీ చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎన్నుకున్నారు. కీర్తి సురేష్ ఇమేజ్ మహానటి తో ఒక్కసారిగా మారిపోయింది. అంతకు ముందు కూడా ఈ అమ్మడు గ్లామర్ కంటే కూడా పెర్ఫార్మెన్స్ కే ఓటు వేసేది. అయితే ఇపుడు మహేష్ పక్కన అనగానే ఆడిపాడుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కి కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టే కీర్తిని తీసుకున్నారు అని అంటున్నారు. దాంతో మహేష్ బాబు కీర్తి ఒకరికొకరు నటనలో  పోటీ పడతారు అన్న మాట.

ఇలాగే మరో సినిమా విషయంలోనూ టాక్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషీయం తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి విధితమే ఈ మూవీలో ఆయన పక్కన హీరోయిన్ గా  సాయిపల్లవిని సెలెక్ట్ చేశారని కూడా ప్రచారం గట్టిగా సాగుతోంది. సాయిపల్లవిని చూస్తే ఆమె కూడా ఇప్పటిదాకా గ్లామర్ కంటే కూడా పెర్ఫార్మెన్స్ కే ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలు చేసింది. ఈ మూవీలో కూడా ఆమె తన పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతుంది అంటున్నారు. మరి పవన్ కూడా ఆమెతో పోటాపోటీగా నటిస్తారు అని కూడా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇపుడున్న ట్రెండ్ కి భిన్నగా ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు పెర్ఫామెన్స్ తోనే కుమ్మేస్తామని అంటున్నారుట.

మరింత సమాచారం తెలుసుకోండి: