ఇక తాజాగా ఈ చిత్రాన్ని బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రసారం చేశారు. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం బుల్లితెరపైనైనా రికార్డులు క్రియేట్ చేస్తుందని.. ప్రభాస్ అభిమానులు భావించారు. అయితే, ప్రభాస్ నటించిన ఓ భారీ చిత్రం మాత్రం టీవీలో కూడా ఫెయిల్ అయి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో ఆమధ్య 'సాహో' అనే భారీ చిత్రం వచ్చింది. 'బాహుబలి' తర్వాత రిలీజైన సినిమా కాబట్టి ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా, టీవీలో మంచి ఆదరణ వస్తుందన్న నమ్మకంతో భారీ అంచనాలతో ఇటీవల ఓ ఛానెల్ లో దీనిని ప్రసారం చేసింది.
కానీ చిన్న స్క్రీన్పై కూడా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. స్టార్ హీరోల సినిమాలు మూడోసారి, నాలుగో సారి బుల్లితెరపై ప్రసారం అయితే ఎటువంటి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయో.. అలాంటి టీఆర్పీని కూడా ఈ చిత్రం సాధించలేకపోయింది. అయితే, విచిత్రంగా 5.8 టీఆర్పీ సాధించి టీవీలో కూడా ఇది ఆదరణకు నోచుకోలేదట. ఎంతో ఇమేజ్ వున్న ఒక స్టార్ హీరో నటించిన కొత్త చిత్రానికి ఈ స్థాయి రేటింగ్ రావడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. చిన్న హీరోలు నటించే సినిమాలకు, రిపీట్ ప్రసారాలకు కూడా మరి కాస్త టీఆర్ఫీ వస్తుందని, 'సాహో'కే ఇలా జరిగిందని అంటున్నారు.