ప్రభాస్ కెరీర్ ని చూస్తే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అని చెప్పక తప్పదు. ఎందుకంటే బాహుబలి దెబ్బకు మనోడు చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలన్నా చేయలేని పరిస్థితి. ఏ సినిమా చేసినా ఇంటర్నేషనల్ క్రేజ్ ఇట్టె వచ్చేస్తోంది. బాహుబలి తర్వాత చాలా కష్టపడి తీసిన  సాహో దెబ్బ వేసింది. అయితే అందుకే మనోడు ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ సినిమాని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావలసి ఉంది. సాహో దెబ్బకి మళ్ళీ రీ షూట్ కి వెళ్లిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా కరోనా దెబ్బకు మరింత ఆలస్యం అయింది.

అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమలు అనౌన్స్ చేశాడు. మొదట నాగశ్విన్ తో ఒక సినిమా అనౌన్స్ చేయగా అది బాగా హాట్ టాపిక్ అయింది. అయితే దాని తరువాత అనౌన్స్ చేసిన సినిమా మాత్రం అసలు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయింది. దానికి ముఖ్య కారణం రామాయణ కధ నేపధ్యంలో సినిమా ప్లాన్ చేయడం అందులో ప్రభాస్ ని రాముడిగా చూపడం. సైఫ్ అలీ ఖాన్ ని రావణాసురుడిగా ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ ప్రకటించినా ఈ సినిమాలో సీత ఎవరు అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే.

అయితే ఈ సినిమాలో సీత ఈమనే అంటూ దాదాపు అరడజను మంది హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. అందులో ముందుగ అనుష్క శెట్టి పేరు తెర మీదకు వచ్చింది. ఆమె చేయడం లేదని ప్రకటించింది కూడా. ఆ తరువాత వరుసగా కియారా అద్వానీ, కీర్తి సురేష్, జాక్వేలిన్ ఫెర్నాండేజ్, అనుష్క శర్మ, కృతి సనన్ లాంటి వాళ్ళ పేర్లు తెర మీదకు వచ్చాయి. అయినా ఇప్పటికీ దర్శకుడు అయితే పేరును ఫైనల్ చేయలేదు. ఎప్పటికి ఫైనల్ చేస్తారు అనేది కూడా తెలీదు. మరి ఈ అరడజను పేర్లతోనే ఈ ప్రచారం ఆగుతుందో లేక ఇంకెంత మంది పేర్లు ఈ లిస్టులో యాడ్ అవుతాయో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: