అల్లు అర్జున్ నటించిన యాక్షన్ రోమ్యాంటిక్ సినిమా ఇద్దరమ్మాయిలతో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో అమలా పాల్, కేథరీన్ హీరోయిన్స్ గా నటించారు. ఇద్దరమ్మాయిలతో సినిమా వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ఈ సినిమా సాంగ్స్ చాలా చోట్ల వినపడతాయి. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఈ సినిమాని నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు.



అయితే ఈ సినిమాను జీ తెలుగులో ఎక్కువగా ప్రసారం చేస్తుంటారు. అయితే బహుశా సినిమా చూసినప్పుడు ఎవరు గమనించి ఉండరు. కానీ, ఈ సినిమాలో ఒక పొరపాటు ఉంది. అంటే కథ పరంగా కాదు, ఒక సీన్ లో ఒక పొరపాటు ఉంది. అదేంటంటే. అల్లు అర్జున్, అమలా పాల్ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడతారు. వాళ్లు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్టు అల్లు అర్జున్ పేరెంట్స్ కి, అమలా పాల్ పేరెంట్స్ కి స్కైప్ ద్వారా తెలియజేస్తారు.


అయితే ఇందులో పొరపాటు ఏముంది అనుకోకండి. ఒకసారి పైన ఉన్న ఫోటోని మంచిగా గమనించండి. స్కైప్ కాల్ లో కింద మైక్ సింబల్ ఆఫ్ చేసి ఉంది. అంటే మైక్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినిపించదు. కానీ ఈ సీన్ లో మాత్రం వీడియో కాల్ లో మాట్లాడే మాటలు అందరికీ క్లియర్ గానే వినిపిస్తాయి. అంటే దీని వల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు అనుకోండి. కానీ ఎప్పుడైనా మనం సినిమా చూసినప్పుడు “ఇది పొరపాటు కదా? మామూలుగా అయితే ఇలా ఉండదు కదా?” అని అనిపిస్తుంది అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: