ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోగా తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుంటున్న హీరో సత్యదేవ్. వెంకీ – మహేశ్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ అత్తారింటికి దారేది.. తదితర సినిమాల నుంచి జ్యోతిలక్ష్మీ, ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవారెవరు.. ఇలా ఒక్కో సినిమాతో ఎదుగుతూ వస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ స్టార్ హీరోయిన్ తమన్నాతో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా చేస్తున్నాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మోక్ టైల్’ అనే సినిమాకు ఇది రీమేక్. ఇటివలే షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే.. ఇప్పుడీ సినిమాపై ఓ ఆసక్తికరమైన న్యూస్ రౌండ్ అవుతోంది.

హీరోగా బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాలతో హిట్లూ కొట్టాడు సత్యదేవ్. మంచి టాలెంట్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగశేఖర్. ఆగష్టు 28న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ రెండు రోజులుగా ఓ వార్త వైరల్ అవుతోంది. బడ్జెట్ పరిమితులు దాటుతోందని, రెమ్యునరేషన్ల విషయంలో తేడాలొచ్చాయంటూ రకరకాల గాసిప్స్ రౌండ్ అయ్యాయి. అయితే.. సినిమా ఆగిపోలేదని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సత్యదేవ్ క్లారిటీ ఇచ్చాడనే వార్త కూడా రౌండ్ అవుతోంది. దీనిపై దర్శక, నిర్మాత నాగశేఖర్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.


సినిమా షూటింగ్ పై అఫిషియల్ అనౌన్స్ లేకపోవడంతో ఈ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తమన్నా ఇటివలే కరోనా బారి నుంచి కోలుకుంది. షూటింగ్స్ లో జాయిన్ అయ్యేందుకు, బాడీ ఫిట్ నెస్ కోసం కసరత్తులు కూడా ప్రారంభించింది. ఈనేపథ్యంలో ఈ సినిమాపై ఇటువంటి వార్తలు రావడం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. దీనిపై దర్శక, నిర్మాత నాగశేఖర్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తే ఇటువంటి పుకార్లకు చెక్ పెట్టినట్టవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: