దక్షిణాది రాష్ట్రం తమిళనాడు సినీ అభిమానులందరి చేత "తలైవా" అని పిలువబడే సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ అరంగేట్రం చేయడంలేదని పేర్కొంటూ ఇటీవల ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇక రజినీ రాజకీయాల్లోకి వెళ్లకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఆ లేఖలో రాసి ఉండటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ లేఖ విషయమై రియాక్ట్ అయిన రజినీకాంత్లేఖ ఫేక్ అని తెలిపారు. అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టుగానే తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని వెల్లడించారు. దీంతో అభిమానులు అంతా రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ రజినీకాంత్ ఆరోగ్యం విషయమై స్పందించారు. ''డియర్ రజినీకాంత్ సర్. మీరు వజ్రం లాంటి వారు, నిధి లాంటి వారు. మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. ఆరోగ్యపరంగా మీకు ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీ పెట్టినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. మీపై మాకున్న గౌరవంలో ఎలాంటి మార్పు ఉండదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము'' అంటూ ట్వీట్ చేశారు ఖుష్బూ.

కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్‌లో రజినీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారని, ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్‌ 12, తన పుట్టినరోజులోగా తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారని రాసి ఉండటంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. 2017 డిసెంబర్‌లో రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. అది జరిగి ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా పార్టీని స్థాపించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రజినీకాంత్ భవిష్యత్ ఆలోచనలు అలాగే తీసుకోబోయే కార్యాచరణ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రజలు మరియు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: