అయితే వివాహం చాలా రహస్యంగా జరిగిపోయింది..ముంబైలో కఠినంగా లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతుండటంతో కాజల్ పెళ్లికి ఆడంబరాలకు, హంగామాకు దూరంగా నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ కాజల్, గౌతమ్ కిచ్లూ పెళ్లిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ పెళ్లికి అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.పెళ్లికి కొద్ది గంటల ముందు కాజల్, గౌతమ్ సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోదరి నిషా అగర్వాల్ ఇతర కుటుంబ సభ్యులు ఆనందంతో డ్యాన్సులు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇక కాజల్ పెళ్లికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. ఇకకాజల్ అగర్వాల్ పెళ్లి గురించి క్రేజీ కామెంట్స్ చేశారు.
రకుల్ ప్రీత్ మరియు మంచు లక్ష్మి. వివాహం జరగడానికి కొద్ది గంటల ముందు పెళ్లికూతురుగా మారిన కాజల్ అగర్వాల్ తన ఫోటోను షేర్ చేసింది. ఇది తుఫాన్కు ముందు ప్రశాంతత అంటూ కామెంట్ చేసింది. కాజల్ పోస్టుపై రకుల్, మంచు లక్ష్మీ తదితరులు స్పందించారు. ముద్దుగమ్మలా ఉన్నావు...అంటూ పెళ్లి శుభాకాంక్షలు అందించారు. అయితే కాజల్ తన అభిమానులకి మరొక శుభవార్తను వినిపించింది. తాను పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పి సినీ పరిశ్రమను ఇప్పుడప్పుడే వదలని చెప్పింది.