మలయాళంలో బిజూ మీనన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. అయితే మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఈ రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రానా వేరే సినిమాలకు కమిట్మెంట్స్ ఇచ్చి ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కి ఒప్పుకోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది..ఇటీవలే కన్నడ లో రన్నా పేరు తో సూపర్ హిట్ అందుకున్న సుదీప్ ని ఈ సినిమా లో విలన్ గా చేయించాలని ఆలోచిస్తున్నారట.. పవన్ సినిమా కాబట్టి సుదీప్ ఓకే అనే ఛాన్స్ లు ఎక్కువ..
ఇక వకీల్ సాబ్ సినిమా ని ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధం చేసిన పవన్ మిగితా సినిమాలను ఇంకా మొదలుపెట్టలేదు.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరియాడికల్ సినిమా కి ఇంకొంత టైం పట్టేలా ఉంది.. హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించట్లేదు.. దాంతో పవన్ ఫోకస్ మొత్తం వకీల్ సాబ్ మీదే ఉన్నట్లు అర్థమవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు..