టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి తనదైన టైం లో స్టార్ హీరోలను సైతం తన డేట్స్ కోసం వెయిట్ చేయించుకుంది.. బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ లో నటించి దేశమంతాటా తెలిసేలా చేసుకుంది. సినిమాలు ఏవీ లేకపోయినా టాలీవుడ్ లో ఫిలిం మేకర్స్ మాత్రం తమన్నా ని ప్రత్యేక పాత్రల్లో నటింప చేయాలనీ చూస్తున్నారు.. అందుకు తగ్గట్లే ఆమెకు నితిన్ 'అంధాధూన్' సినిమా తెలుగులో రీమేక్ ఓ వెరైటీ పాత్రను చేస్తుంది.. ఈ సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్.. గతంలో అంధుడిగా నటించిన సినిమాలు అన్ని హిట్ సినిమాలే.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో నితిన్ ఈ సినిమా కి ఒప్పుకున్నాడని చెప్పొచ్చు.. ఈ సినిమా కి మేర్లపాక గాంధీ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు..
ఇక తమన్నా హీరోయిన్ గా సత్యదేవ్ హీరో గా సీతకం గుర్తుందా అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఆగిపోతున్నట్లు వార్తలు వస్తుండగా ఈ సినిమా నుంచి ఆమె డ్రాప్ అయ్యారని అందుకే తమన్నా కూడా వేరే సినిమాలవైపు చూస్తోందని ఫిలిం నగర్ లో ప్రచారం ఊపందుకుంది. అయితే నిర్మాతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. వేరే కారణాల వల్ల కొంత లేట్ అవుతున్నప్పటికీ ఆగలేదని, త్వరలోనే రీ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నట్టుగా తెలిసింది. తమన్నాకు ఇటీవలే కోవిడ్ వచ్చి రికవరీ కావడం వల్ల కాల్ షీట్స్ లో సమస్య వచ్చిందే తప్ప సత్యదేవ్ తిమ్మరుసులో జాయిన్ కావడానికి దీనికి సంబంధం లేదంటున్నారు. ఏదేమైనా గుర్తుందా శీతాకాలం యూనిట్ దీనిమీద అఫీషియల్ క్లారిటీ ఇస్తే బెటర్ అని అభిమానులు కోరుకుంటున్నారు..