ఇకపోతే మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు టాక్. అలానే ఈ సినిమాని కోహినూర్ దొంగతనం నేపథ్యంలో దర్శకుడు క్రిష్ తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఎం రత్నం నిర్మాతగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కు చెందిన దిగ్గజ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. స్వరవాణి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే లాక్ డౌన్ కి ముందు రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోగా అతిత్వరలో దీని తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు.
ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని కాగా వాటిలో ఒకటి వజ్రాల దొంగ కాగా మరొకటి సాధారణ యువకుడి పాత్ర అని సమాచారం. సినిమాలోని రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అలానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనికి సంబంధించి ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా సమాచారం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!