ఇటీవల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ నటించిన సినిమా మిస్టర్ మజ్ను. అయితే రిలీజ్ తరువాత అది కూడా కేవలం యావరేజ్ విజయంతోనే సరిపెట్టుకుంది. అయితే ఆ తర్వాత కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఎట్టకేలకు తన తదుపరి సినిమా బాధ్యతలను బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ కి అప్పగించారు. ఇక కొన్నాళ్ళ నుండి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ మూవీ నుండి ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.
మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో అఖిల్ పాత్ర ఎంతో అదిరిపోతుందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని యూనిట్ అంటోంది. అలాగే తప్పకుండా ఈ సినిమా తన కెరీర్ పరంగా మంచి బ్రేక్ ఇస్తుందని హీరో అఖిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో బొమ్మరిల్లు సినిమాతో అత్యద్భుతమైన విజయాన్ని దక్కించుకున్న భాస్కర్ ఆ రేంజ్ లోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారని అలానే రిలీజ్ తర్వాత తప్పకుండా ఈ సినిమా బొమ్మరిల్లు స్థాయిలోనే మంచి విజయాన్ని అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుందట. మరి అది ఎంతవరకు జరుగుతుందో ఈ సినిమా ఎలా ఉంటుందో, ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు మరి....!!