యువ హీరో శర్వానంద్ మిగతా హీరోలకు భిన్నంగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఈ ఇయర్ మొదట్లో జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ తన నెక్స్ట్ సినిమా శ్రీకారంతో వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహా సముద్రం సినిమా ఫిక్స్ చేసుకున్న శర్వానంద్ మరో సినిమాకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్న శర్వానంద్ ప్రముఖ దర్శకుడు దేవా కట్ట అసిస్టెంట్ శ్రీరాం చెప్పిన కథ నచ్చడంతో అతని డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో శర్వానంద్ హీరోగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. శ్రీరాం చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందని తెలుస్తుంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఈమధ్య వరుస సినిమాలతో శర్వానంద్ సూపర్ ఫాం లో ఉన్నాడు. ఆల్రెడీ రిలీజ్ కు ఒక సినిమా రెడీగా ఉంది.

సెట్స్ మీదకు రెండు సినిమాలు వెళ్లబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో సినిమాకు లైన్ క్లియర్ చేశాడు. ఫలితాలు ఎలా ఉన్నా తన మార్క్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు శర్వానంద్. చూస్తుంటే 2021 శర్వానంద్ సూపర్ హిట్ కొట్టేలానే ఉన్నాడు. తను నటించిన శ్రీకారం సినిమా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.                                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: