మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు అని తెలియగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగాయి. సాగర్ చంద్ర డైరక్షన్ లో ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే మరో హీరో ఎవరన్నది మాత్రం తెలియట్లేదు. ముందు రానారీమేక్ లో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే రానా మాత్రం ఈ రీమేక్ చేయట్లేదని టాక్.

ఇక పవన్ అభిమాని యువ హీరో నితిన్ కు ఆ లక్కీ ఛాన్స్ ఇస్తున్నారని అన్నారు. కాని ఆ వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. రీసెంట్ గా కన్నడ స్టార్ సుదీప్ పవన్ తో నటిస్తారని వార్తలు వచ్చాయి. ఆ మధ్య సుదీప్, పవన్ మీటింగ్ ఈ సినిమా గురించే అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏకే రీమేక్ కు పవన్ ఫైనల్ అవగా ఆ సెకండ్ లీడ్ రోల్ చేసే హీరో ఎవరన్నది మాత్రం నిర్ణయించలేదు.

అదేదో త్వరగా చిత్రయూనిట్ ప్రకటిస్తే బెటర్ లేదంటే ఆ రీమేక్ లో చిరు, పవన్ నటిస్తారని కూడా వార్తలు రాస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం పవన్ 25 రోజుల డేట్స్ ఇస్తున్నట్టు టాక్. ఇప్పటికే సాగర్ చంద్ర రీమేక్ స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తుంది. మొత్తానికి సాగర్ చంద్ర ఈ రీమేక్ తో స్టార్ డైరక్టర్ రేసులో నిలుస్తాడని చెప్పొచ్చు.                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: