సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించనున్న సంగతి ముందే తెలిసిందే. అయితే ఈయన ప్రస్తుతం నటించనున్న చిత్ర దర్శకుడు... ఆర్ ఎక్స్ 100 ఈ సినిమాతో ఘన విజయాన్ని తన అకౌంట్లో వేసుకున్న అజయ్ భూపతి. ఈయన డైరెక్షన్లో ''మహా సముద్రం'' అనే మల్టీస్టారర్ సిద్ధార్థ్ నటిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఈ చిత్రంతో సిద్ధార్థ మరోసారి తన లక్ ను పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా కుర్ర హీరో శర్వానంద్ నటించనున్నాడు. ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకొన్నాడు హీరో సిద్ధార్థ్. తాజాగా సిద్ధార్థ్ చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో నటిస్తున్నానంటూ తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. ''8 సంవత్సరాల తరువాత నా మొదటి తెలుగు చిత్రం 'మహాసముద్రం' పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నేను చెప్పినట్లుగానే, అనుకున్నట్లుగానే తిరిగి మీకోసం వస్తున్నాను. ప్రస్తుతం నేను ఒక గ్రేట్ టీమ్ - గ్రేట్ కో యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీ విషెస్ నాకు కావాలి'' అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. అయితే ఒకప్పుడు సిద్దార్ధ్ ను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులు.... ఇప్పుడు మళ్లీ అదే తరహాలో తనను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాడు హీరో సిద్ధార్థ్.