ఎట్టకేలకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఈ వేడుకకి చాలా తక్కువ మంది, అది కూడా అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్లు మాత్రమే హాజరయ్యారు. ఆమె వివాహ వేడుకకు సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అబ్బాయిలు అందరు తమ అభిమాన నటి మరొకరి సొంతం అయిపోతుందని బాధలో ఫోటోలు పెడుతున్నారు.

ఇక తెలుగులో లక్ష్మీకళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా రెండో సినిమా చందమామ బంపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. ఆ దెబ్బకు దాదాపు స్టార్ హీరోల సరసన నటించిన ఈమె తెలుగు తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించింది. కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైపోయిన ఈమె తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కూడా చాలానే చేసింది. అయితే విషయం ఏంటంటే ఈమె ఇప్పుడు చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా కూడా కారణంగా చాలా రోజులుగా షూట్ వాయిదా పడింది. ఇప్పుడు అన్ని సినిమాలు సెట్స్ మీదకు రావడంతో ఈ సినిమాను కూడా షూట్ మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాని నవంబర్ రెండవ వారం నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్తారట. అంటే రెండో వారానికల్లా కాజల్ కూడా షూట్ కి హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు. పాపం చేసుకోక చేసుకోక 30 దాటిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుంటే ఆమెకు ఒక రెండు మూడు నెలల గ్యాప్ కూడా దొరక్కపోవడం బాధాకరమే. ఈ విషయం తెలిసిన కాదు ఫ్యాన్స్ అందరరూ తమ కాజూ పాపకి ఎంత కష్టం వచ్చింది అని బాధ పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: