ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయినప్పటి నుండి అన్నీ పాన్ ఇండియన్ లెవెల్ సినిమాలే చేస్తున్నాడు. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత ఆయన సాహో అనే సినిమా చేశాడు. ఈ సినిమా మన వాళ్ళకి ఎక్కక పోయినా బాలీవుడ్ జనాలకు బాగా నచ్చింది. సో కలెక్షన్స్ విషయంలో సేఫ్ అయింది. మరి ఈ పద్ధతి నచ్చిందో ఏమో గాని ఆ తరువాత నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇంకా కొంత మేర షూటింగ్ మిగిలి ఉంది. అయితే సినిమా కథ ప్రకారం ఇటలీలోని షూట్ చేయాలి.

అందుకే కరోనా వైరస్ భారీగా ఉన్నాయి అని తెలిసినా ఇటలీకి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమో సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో అక్కడ కూడా ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ బాగా ఎక్కువై పోయాయి. దీంతో యూనిట్ అంతా మళ్ళీ తిరిగి రావడానికి ప్లాన్ చేసింది. ఈరోజు ఫ్లైట్ ఎక్కవచ్చు అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక వేళ ఇటలీ వెళ్లడానికి అనుమతులు కుదరకపోతే ఇక్కడే షూట్ చేయాలని భావించి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇటలీ వీధులకి సంబంధించిన సెట్ వేశారు. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య అగ్ని ప్రమాదం సంభవించి ఆ సెట్ లో కొంత భాగం దెబ్బ తిన్నదట.

నిజానికి ఒకసారి వెళ్లి షూట్ చేసుకురావాల్సిన దానిని కరోనా దెబ్బ కి రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది. రెండు సార్లు వెళ్ళినా మొత్తం పూర్తి కాలేదు. ఈ యూనిట్ మొత్తానికి రెండో సారి విమాన చార్జీలు అదనం కాగా కాలిపోయిన సెట్ ని మళ్ళీ రెడీ చేయడానికి మళ్లీ భారీగా ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి పరిమితిని మించి ఖర్చు చేశామని భావిస్తున్న నిర్మాతలు ఏం చేయాలని తెలియక తలలు పట్టుకుంటున్నారు. నిర్మాతలు అంటే ఎవరో బయట వాళ్ళు కాదు లెండి ప్రభాస్ స్నేహితులే. అయితే ఎంత స్నేహితులైనా ఈ విషయాన్ని ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితుల్లో ఉన్నారట. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: