ఈ ఏడాది మొదట్లో అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా తీసి హిట్ కొట్టాడు మహేష్ బాబు. రొటీన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎందుకోగాని బంపర్ హిట్ అయి పోయింది. అయితే ఈ సినిమా తీసిన వెంటనే వంశీ పైడిపల్లితో ఆయన సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని అని వార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యి గీతా గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ తో ఒక సినిమా ఫిక్స్ అయింది. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే ఈ సినిమా షూట్ అనేది ప్రశ్నార్థకం అయి పోయింది. నిజానికి బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా మొత్తాన్ని యూఎస్ బ్యాక్డ్ డ్రాప్ లో షూట్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అదీ కాక అక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి దీంతో వీసా ప్రాసెస్ బాగా లేట్ అవుతోంది. నిజానికి నవంబర్ 1 వారంలో అక్కడికి వెళ్లి షూట్ చేయాలని భావించారు. అయితే ఇప్పటికీ వీసాలు అప్పుడు అవుతాయనే దాని మీద క్లారిటీ రాలేదు.

దీంతో మహేష్ బాబు ఇప్పుడు ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఒక ప్రచారం అయితే ఈ సినిమా మొత్తాన్ని వచ్చే ఏడాది మొదట్లో షూట్ చేయాలని ఫిక్స్ అయినట్టు జరుగుతుంది. అయితే మహేష్ మాత్రం అమెరికా అనే ఆలోచన తీసేస్తే ఎలా ఉంటుంది అని దర్శకుడిని ఒప్పించే పనిలో ఉన్నాడట. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ అని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో రిస్కు చేయడం అనవసరమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందనేది ?

మరింత సమాచారం తెలుసుకోండి: