ఇదిలా ఉంటే రాధేశ్యాం మూవీని వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతీ మూవీస్ సినిమా, అలాగే ఓ రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీని చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నారు. నాగ్ అశ్విన్ తో చేసే మూవీకి హీరోయిన్ గా దీపికా పదుకొణెని ఆల్ రెడీ సెలెక్ట్ చేశారు. ఇక ఆదిపురుష్ మూవీకి మాత్రం సీత ఎవరో ఇంకా తేలలేదు.
అయితే ముగ్గురి హీరోయిన్లను చాయిస్ గా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడుట ఆ మూవీ డైరెక్టర్ ఓం రౌత్. అందులో కైరా అద్వానీ, కృతి సనన్. శ్రధ్దాకపూర్ ఉన్నారని టాక్. వీరిలో శ్రద్ధ ఇప్పటికే ప్రభాస్ తో సాహోలో చేసింది. ఈ ఇద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి కానీ మూవీ ఆశించిన విజయం దక్కించుకోలేదు కాబట్టి ఆమె పేరుని పక్కన పెడతారా అన్న చర్చ అయితే ఉంది.
ఇక ఆ తరువాత చూసుకుంటే కృతి సనన్. కైరా అద్వానీలలో ఒకరికి చాన్స్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఈ జోడీ ప్రభాస్ కి కూడా ఫ్రెష్ అవుతుంది అంటున్నారు. అయితే సీత క్యారక్టర్ విషయంలో పెర్ఫార్మెన్స్ కి కూడా స్కోప్ ఉండాలి కాబట్టి ఓం రౌత్ దే ఫైనల్ డెసిషన్ అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ రానున్న రెండు సినిమాలకు కూడా బాలీవుడ్ భామలే హీరోయిన్స్ అన్నది ఫిక్స్.