అడవి నేపథ్యంలో సాగుతుండడంతో ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో ఆదిలాబాద్, వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించాలనీ భావిస్తోందట చిత్రబృందం. ఇక ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయినా... రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ 'వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో' రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే.
ఈ సినిమాలో అల్లు అర్జున్కు సరిజోడిగా ఓ స్టార్ హీరోను విలన్గా చూపించబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారట చిత్ర బృందం. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి ఓ క్రేజీ రోల్లో కనిపించనుందని సమాచారం. ఆమె అల్లు అర్జున్కు చెల్లెలి పాత్రలో కనిపించనుందట. ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుండి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారని.. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నవంబర్ లో ఈ సెట్స్ లోనే బన్నీ, రష్మిక పై రెండు సాంగ్స్ ను తీయబోతున్నారని సమాచారం.