అవునూ.. సీనియర్ హీరోయిన్, నగరి ఎమ్మెల్యే రోజా ను టాలీవుడ్ ప్రొడ్యూసర్ మరియు కమెడియన్ బండ్ల గణేష్ కలవడం ఇపుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే అయితే వీరి మద్య ఎపుడు గొడవ జరిగింది? ఏ విషయంలో జరిగింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ లో కలిసిన వీరిద్దరు పాత గొడవలన్ని మరిచిపోయి సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేష్ తెలుపుతూ.. "చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని" కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. కొంతకాలం క్రితం జరిగిన వివాదాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఇలా కలిసిపోవడం అభిమానులకు సంతోషాన్ని పంచింది. రాజకీయంగా వేరుదారులైనా సినీ ఇండస్ట్రీ పరంగా తామిద్దరం ఒకటేనని బండ్ల ట్వీట్ తో నిరూపించినట్టైంది. అసలేం జరిగిందంటే.. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు బండ్ల గణేష్ కు కొంత కాలం క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్ లో గొడవ జరిగింది. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన రోజాపై బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా నోటికి పనిచెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరికీ మాటలు లేవు. ఆ తర్వాత మళ్లీ ఇపుడే వారిద్దరు కలిశారు. ఇది చూసిన జనం ఏంటో బండ్లన్న ఏది చేసినా.. ఏం ట్వీట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతుంది అంటే ఏంటో అనుకున్నాం.. కానీ ఇది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: