ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టైలిష్ స్టార్ ఈ ఏడాది "అల వైకుంఠపురంలో" తో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన  ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ కెరీర్లోనే  దాదాపు 150 కోట్లు వసూలు చేసింది.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా.. సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రం షూటింగ్ మార్చిలోనే మొదలుపెట్టాలి అనుకున్నారు. కథలో భాగంగా దట్టమైన అడవి ప్రాంతం కావాలని కేరళలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల లాక్‌డౌన్ ఏర్పడడంతో ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఇంకా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాలేదు. దానికి ప్రధాన కారణం కేరళలో మళ్ళీ కరోనా విజృంభించడమే అని స్పష్టమవుతుంది.ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్ ను వైజాగ్ కు మార్చినట్టు తెలుస్తుంది. నవంబర్ 5 నుండీ వైజాగ్‌లో ‘పుష్ప’ చిత్రం షూటింగ్ మొదలుకానుందట.

చిత్రీకరణ మొత్తం ఏపీ, తెలంగాణలోనే పూర్తి చేసి 2021 సమ్మర్ కి సినిమాని రెడీ చెయ్యాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ గుబురు గడ్డం మరియు లాంగ్ హెయిర్ ను పెంచి కొత్త లుక్ లోకి మారాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఇక  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప  సినిమాతో  ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


మరింత సమాచారం తెలుసుకోండి: