ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఇంకా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాలేదు. దానికి ప్రధాన కారణం కేరళలో మళ్ళీ కరోనా విజృంభించడమే అని స్పష్టమవుతుంది.ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్ ను వైజాగ్ కు మార్చినట్టు తెలుస్తుంది. నవంబర్ 5 నుండీ వైజాగ్లో ‘పుష్ప’ చిత్రం షూటింగ్ మొదలుకానుందట.
చిత్రీకరణ మొత్తం ఏపీ, తెలంగాణలోనే పూర్తి చేసి 2021 సమ్మర్ కి సినిమాని రెడీ చెయ్యాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ గుబురు గడ్డం మరియు లాంగ్ హెయిర్ ను పెంచి కొత్త లుక్ లోకి మారాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..