టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు కలిసి చేసిన గీతా గోవిందం సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరు కలిసి చేసిన డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. చేసిన రెండు సినిమాలతోనే ఈ ఇద్దరి జోడీ సూపర్ క్రేజీగా మారింది. అయితే మరోసారి ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా మరో కొత్త దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈసారి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తారని టాక్. ఈ ఇద్దరు చేసే సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. విజయ్ సినిమా అయితే తాను ఎప్పుడైనా రెడీ అంటుంది రష్మిక. ఛలో సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక ఈ ఇయర్ మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక నితిన్ భీష్మతో కూడా హిట్ అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ భీష్మ సినిమాలో నటిస్తుంది రష్మిక. తెలుగులో అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. విజయ్, రష్మిక ఇద్దరు కలిసి చేస్తే తప్పకుండా మరో హిట్ కొడతారని చెప్పొచ్చు.                                                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: