వకీల్ తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ చారిత్రక మూవీ చేయబోతున్నాడు. తదుపరి హరీష్ శంకర్ తో ఓ కమర్షియల్ రోమాంటిక్ ఎంటర్టైనర్, అలాగే సురేందర్ రెడ్డితో ఓ ఊర మాస్ ఎంటటైనర్ చేయనున్నాడు. అయితే ఈమధ్యన అనుహ్యంగా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లైన్ లోకి వచ్చింది. కాగా.. వకీల్ సాబ్ పూర్తయిన వెంటనే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ పట్టాలెక్కనుందని తాజా సమాచారం. ఇద్దరు ఇగోస్టుల మధ్య నడిచే కథ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’.
ఇకపోతే, ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుపాటి రానా.. యంగ్ హీరో నితిన్ పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి. అయితే వీరిద్దరిలో ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే వుంది. అదో సమస్య అనుకుంటే, ఇపుడు తాజాగా ఈ సినిమాకి మరో సమస్య వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత లేదనే సంగతి మలయాళ మాతృక చుసిన ఎవ్వరికైనా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కధ కేవలం హీరోల మీదే బేస్ అయి ఉంటుంది.
ఇపుడు అదే ఈ సినిమాకి పెద్ద సమస్యగా మారింది. పట్టుమని వారం రోజులు కూడా కాల్షీట్స్ అవసరం లేని హీరోయిన్ పాత్ర కోసం ఎవరూ ముందుకు రావట్లేదని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో సదరు నిర్మాత తల పట్టుకుంటున్నాడు. అందుకే ఈ మూవీలో సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చినా ఆమె నటించే అవకాశాలు దాదాపు తక్కువే అని తెలుస్తోంది. ఎందుకంటే బేసిగ్గా సాయి పల్లవి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తుంది. దాంతో నిర్మాత ఆలోచనలో పడ్డాడు.