తెలుగు బిగ్ బాస్ షో నాలుగో సీజన్ లో గత వారం దివి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ.. ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి గతవారమే ఎలిమినేట్ అయిపోయింది దివి. హౌజ్‌లో మిగిలిన అమ్మాయిలున్నా కూడా దివి మాత్రం అందరి కంటే ఎక్కువగానే ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈమె ఎలిమినేట్ అయిన తర్వాత కొన్ని సంచలన నిజాలు బయటికి వచ్చాయి. దివి కుటుంబంలో ఒకరు చనిపోతే తనకు ఆ విషయం చెప్పలేదని.. కనీసం చివరి చూపు కూడా లేకుండా పోయిందని బాధపడుతుందట. అయితే ఇంతకీ ఆమె ఫ్యామిలీలో చనిపోయింది ఎవరు? అయితే ఇంతకీ ఏం జరిగింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాక బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు, వారానికి ఒకసారి వచ్చి పలకరించే హోస్ట్ తో తప్ప మరెవరితో.. ఎటువంటి కమ్యూనికేషన్ ఉండడానికి వీలు లేదు. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులు తెలియపరచరని తాజా ఉదంతం ద్వారా తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగా దివి తాతగారు మరణించారట. అయితే ఆ విషయం బిగ్ బాస్ నిర్వాహకులు దివికి తెలియపరచలేదట.
ఇదిలా ఉంటే.. గత వారం ఎలిమినేట్ అయిన ఇంటికి వెళ్లిన దివి.. అందరినీ పలకరించి.. అమ్మమ్మను చూసి తాతయ్య ఎక్కడని అడుగగా ఆమె గట్టిగా ఏడ్చేశారట. తాతయ్య చనిపోయారని తెలుసుకున్న దివి షాక్ కి గురైందట. మొదటివారం ఎలిమినేషన్ జరిగిన సమయంలోనే ఇదంతా జరిగిందని దివి చెప్పుకొచ్చారు.  హీరోయిన్ అవుతా అంటే ఇంట్లో వాళ్ళు ససేమిరా అన్నారట. తాతయ్య మాత్రమే ప్రోత్సహించి పరిశ్రమకు రావడానికి కారణం అయ్యారట. హీరోయిన్ గా, నటిగా నేను సక్సెస్ కావాలని కోరుకున్న, తాతయ్యను చివరి చూపు కూడా చూసుకోలేక పోయానని దివి బాధపడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: