రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన సంగతి తెలిసిందే .. అందులో మొదటిది రాధేశ్యామ్ తొందరలోనే రిలీజ్ కాబోతుంది..  సాహో సినిమా పరాజయం తర్వాత చేయబోయే ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు.. సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు.. అందుకే డైరెక్టర్ తో రీ సూటి చేయించి మరీ ప్రభాస్సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్  ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..

ఇక ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..  సీత తరహా పాత్రకు కృతి సనాన్ పేరును పరిశీలించారని కథనాలొచ్చాయి.తాజా సమాచారం ప్రకారం.. మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.శ్రద్ధా కపూర్ .. కియారా అద్వానీలను కూడా నాయికలుగా నటింపజేసేందుకు మేకర్స్ సంప్రదిస్తున్నారట. మరి వారు ఏ పాత్రల్లో కనిపిస్తారన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: