ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. మొదటగా కెరటం సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుని హీరోయిన్ గా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత గోపీచంద్ హీరోగా తెరకెక్కిన లౌక్యం సినిమాతో మరొక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగింది.

ఆపై ఆమె నటించిన పండగ చేస్కో, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, ధ్రువ వంటి సినిమాలు గొప్ప విజయాలు అందుకని హీరోయిన్ గా టాలీవుడ్ లో రకుల్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత మరొకసారి చరణ్ హీరోగా ఆమె నటించిన బ్రూస్లీ అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడర్ సినిమా లు మాత్రం భారీ పరాజయాలు మూటగట్టుకుని రకుల్ కెరీర్ ని కొంత ఇబ్బందుల్లోకి నెట్టాయి. క్కడి నుండి ఆమెకు తెలుగులో ఆశించినంత సక్సెస్ లు రాలేదు. కానీ అటు బాలీవుడ్ లో మాత్రం ఆమె సినిమాలు చేస్తూ కొనసాగటం జరిగింది. ఇటీవల కొన్ని నెలలుగా ఆమెకు టాలీవుడ్ లో సినిమాలు లేవనే చెప్పాలి. ఇకపోతే కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో ఆమె పేరు పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవటంతో ఇప్పటి వరకు ఒప్పుకున్న సినిమాల నుంచి పలు నిర్మాణ సంస్థలు ఆమెని తీసేయాలని చూస్తున్నట్లు కూడా కొందరు వార్తలు ప్రచారం చేయడంతో ఈ విషయాలపై ఆమె కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం రకుల్ చేతిలో మొత్తంగా మూడు తెలుగు సినిమాలతో పాటు రెండు తమిళ సినిమాలు అలాగే రెండు హిందీ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన కెరీర్లో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని మంచి హిట్ వచ్చినప్పుడు ఏనాడు పొంగిపోలేదు అలాగే ఫ్లాప్ వచ్చినప్పుడు ఏనాడు కుంగిపోలేదు. రెండింటినీ నేను ఎప్పుడూ ఒకేలా చూస్తాను. ఇటీవల నా పై వచ్చిన తప్పుడు కథనాల విషయం అంటారా అవి నేను పెద్దగా పట్టించుకోను నేనేంటో ప్రేక్షకులకు తెలుసు తప్పకుండా నాకు కూడా మంచి సమయం వస్తుంది, అది వచ్చిన తర్వాత నా పై తప్పుడు రా ప్రచారాలు చేసే వారందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తాను అంటూ రకుల్ తన సన్నిహితుల వద్ద ఇటీవల వాపోయినట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: