అందులో నిజం ఎంతుందో తెలీదు.గతంలో వీరి కాంబినేషన్లో ‘పోకిరి’ ‘బిజినెస్ మ్యాన్’ వంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. పోకిరి సినిమా అయితే అప్పట్లో అన్ని విధాలుగా రికార్డులు సృష్టించింది. బిజినెస్ మ్యాన్ కూడా మంచి హిట్ అయ్యింది. దాంతో.. ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందట. ఈ మధ్యనే పూరి నిర్మాత అనిల్ సుంకర కు ఓ కథ వినిపించాడట. ‘దీనిని మహేష్ గారితో చేద్దాం’ అని ఆయన చెప్పాడట. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఇంకో సినిమా చేస్తాను అని మహేష్… నిర్మాత అనిల్ సుంకరకు మాటిచ్చాడట.
పూరి తన స్క్రిప్ట్ తో కనుక మహేష్ ను మెప్పిస్తే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం గ్యారెంటీ అని సమాచారం. ప్రస్తుతం మహేష్.. పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు పూరి సీన్లోకి ఎంటరయ్యాడు. మరి ఈ స్క్రిప్ట్ అయినా ఓకే అవుతుందో లేదో చూడాలి..! ఇలాంటి మరిన్ని మూవీ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...