ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో దర్శకుడు హరీష్ శంకర్ సినిమా కూడా ఉంది. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాత క్రిష్ సినిమా, తరువాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్, అలానే సాగర్ చంద్రతో మరో సినిమా పూర్తి చేయాలి. ఈ సినిమాల్లో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది మాత్రం హరీష్ శంకర్ సినిమా అనే చెప్పాలి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.


ఇప్పటికే పవన్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూసిన పవన్.. హరీష్ ని పిలిపించి కథ పూర్తయిందా..? అని అడిగారట. అయితే ప్రస్తుతం హరీష్ దగ్గర ఇంకా పూర్తి కథ రెడీగా లేదు. ‘గబ్బర్ సింగ్’ తరువాత తమ కాంబోలో వస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉంటాయనే విషయం హరీష్ శంకర్ కి తెలుసు. పైగా ‘డీజే’ సినిమా రిజల్ట్ తో స్టార్ హీరోలెవరూ కూడా హరీష్ కి ఛాన్స్ లు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సినిమాతో తన సత్తా చాటాల్సివుంది.

అందుకే ‘గబ్బర్ సింగ్’ని మించి ఉండేలా సినిమా తీయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ని తొందరపెట్టి ఏదొక సినిమా చేసేయాలని కాకుండా.. వీలైనంత సమయం తీసుకొని పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణంగానే సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: