ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ సినిమా రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకి రాగానే సినిమాలో యువ హీరో పాత్ర పోషించడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో ముందు వరుసలో నితిన్, సాయి ధరమ్ తేజ్ లు ఉంటారు. నితిన్ ఈ సినిమాలో నటించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఇప్పటికే అతడు సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని బ్యానర్ లో మూడు సినిమాలు చేసి ఉండడంతో… ఆ నిర్మాతలతో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఈ సినిమాలో తాను నటిస్తానని, రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి పట్టింపులు లేవని నిర్మాతలకు చెబుతున్నాడట. తనకు పవన్  కళ్యాణ్ సినిమాలో పాత్ర ఇవ్వమని మొహమాట పెట్టేస్తున్నాడని సమాచారం. మరోపక్క సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ సినిమాలో నటించడం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకే ఈ ఛాయిస్ ని పవన్ కళ్యాణ్ కి వదిలేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్.

ఓ పక్కన అమితంగా ప్రేమించే ఫ్యాన్, మరోపక్క సొంత మేనల్లుడు. మరి వీరిద్దరిలో పవన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. మొదట కోషి పాత్ర కోసం రానాని అనుకున్నా.. ఇప్పుడు ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం. అందుకే తెరపైకి నితిన్, ధరమ్ తేజ్ లాంటి హీరోల పేర్లు వస్తున్నాయి. వీరు నటించడానికి ఆసక్తి చూపుతున్నా.. కోషి లాంటి యాటిట్యూడ్, యారోగన్స్ చూపించే పాత్రకి ఈ ఇద్దరు హీరోలు ఎంతవరకు సరిపోతారనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని మూవీ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి  ..... !!!!!!!

మరింత సమాచారం తెలుసుకోండి: