మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆచార్య. గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏవరేజ్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్, ఆచార్య సినిమా ద్వారా వరుస సక్సెస్ లో దర్శకుడు కొరటాల శివకి అవకాశమిచ్చారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకమైన ఒక విద్యార్థి నాయకుడి పాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్లు తెలుస్తోంది.  

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ తిరు దీనికి కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకులు అలానే మెగాస్టార్ అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఇకపోతే లేటెస్ట్ గా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో నిన్న ప్రముఖ బాలీవుడ్ నటుడ సోనూసూద్ జాయిన్ అయ్యారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నట్లు టాక్.

ఇకపోతే నేడు దర్శకుడు కొరటాల, నటుడు తనికెళ్ల భరణి సహా పలువురు ఆచార్య మూవీ యూనిట్ సభ్యులు సోనూసూద్ ని ప్రత్యేకంగా శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఇటీవల కరోనా సమయంలో ఎందరినో తనవంతుగా ఆదుకొని వారికి సరికొత్త జీవితాన్ని అందించిన  సోను సూద్ ది ఎంతో గొప్ప మనసుని అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మనకు తోచినంతలో ఇతరులకు సాయం చేస్తే బాగుంటుందని ఆచార్య మూవీ యూనిట్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి తో ముగుస్తుందని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: