రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కెరీర్లో మూడో సినిమాగా వచ్చిన వర్షం అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ ను అందుకుని ప్రభాస్ కి మంచి బ్రేక్ ను అందించింది. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగిన ప్రభాస్ మధ్యలో ఎన్నో సక్సెస్ లు అందుకని హీరోగా ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. ఇక ఆ తర్వాత దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు వందలాది కోట్ల రూపాయల కలెక్షన్స్ ని ఆర్జించి ఒక్కసారిగా ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ హీరోగా అత్యద్భుతమైన క్రేజ్ ని మార్కెట్ ని తెచ్చిపెట్టాయి.

అనంతరం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ సినిమా సాహో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇందులో ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నారు. ఇకపోతే దీని తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో  ఆదిపురుష్ సినిమా కూడా చేయనున్నారు ప్రభాస్.  

ఇక ప్రభాస్ ఎంచుకుంటున్న ఈ సినిమాల లైనప్ చూస్తుంటే ముఖ్యంగా బాలీవుడ్ హీరోలకు వెన్నులో వణుకు పుడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకి రూ. 300 కోట్ల రూపాయల భారీ ఖర్చు పెడుతుండగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న నాగ అశ్విన్ సినిమా అలానే అదిపురుష్ సినిమాలు రెండూ కూడా రూ. 600 కోట్ల పైగా భారీ ఖర్చుతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఒకరకంగా ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరో కూడా ఇంత బడా సినిమాల్లో నటించలేదని చెప్పాలి. మరి ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమాలు సక్సెస్ సాధించినట్లయితే ప్రభాస్ రేంజ్ విపరీతంగా పెరగటంతో పాటు హోల్ ఇండియా లోనే అతడు టాప్ స్టార్ గా నిలిచే అవకాశం కూడా లేకపోలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: