సూపర్ స్టార్ మహేష్ బాబు యువ దర్శకుడు పరుశురాం పెట్ల ల తొలి పేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. ఓ వైపు వరుసగా మూడు విజయాలతో మహేష్ బాబు మంచి జోరు మీద ఉండగా మరోవైపు గీతాగోవిందం సక్సెస్ తో మరింత జోష్ మీద ఉన్నాడు దర్శకుడు పరశురామ్. ఇక వీరిద్దరి కలయికలో ఈ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చిన దగ్గరి నుండి ఈ మూవీ ఎలా ఉంటుందో తమ హీరోని పరుశురాం ఎలా స్క్రీన్ పై చూపిస్తాడో అనేటువంటి ఆసక్తి మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో మెదులుతోంది. వాస్తవానికి   కొన్ని నెలల క్రితమే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.

అయితే మధ్యలో కరోనా వల్ల విధించబడిన లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా లోకేషన్స్ కు సంబంధించి దర్శకుడు పరశురామ్ సహా పలువురు టీం సభ్యులు అమెరికా వెళ్లి అక్కడ పలు లొకేషన్స్ ని సెట్ చేసి వచ్చినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా తొలి షెడ్యూల్ 2021 జనవరి మొదటి వారంలో మొదలు కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అధికారిక పూజా కార్యక్రమాలు నేడు ఉదయం ఎంతో ఘనంగా జరిగాయి. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తొలిషాట్ లో కెమెరా స్విచాన్ చేయగా ఆయన ముద్దుల తనయ సితార ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టడం జరిగింది.

మొదటి నుంచి తన సినిమాల యొక్క పూజా కార్యక్రమాలకు వచ్చే అలవాటు లేని మహేష్ బాబు ఈ సినిమా యొక్క ఓపెనింగ్ కి కూడా రాలేదు. 14 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను ఎంతో భారీగా గ్రాండ్ లెవల్ లో నిర్మించనున్న విషయం తెలిసిందే. బ్యాంకు మోసాలు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ అత్యద్భుతంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా ద్వారా తొలిసారిగా మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ సంగీతాన్ని మది ఫోటోగ్రఫీని ప్రముఖ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కలదు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: