రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలతో కనీవినీ ఎరుగని రీతిలో దేశవిదేశాల్లో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక వాటి అనంతరం సుజిత్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ నటించిన సినిమా సాహో. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా ఎంతో భారీ ఖర్చు తో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. గోపీకృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే తుది దశకు షూటింగ్ చేరుకుంది.

అతి త్వరలో దీని చివరి షెడ్యూల్ ని ప్రారంభించి వీలైనంత వేగవంతంగా ముగించి వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక దీని అనంతరం మరొక రెండు సినిమాలను ప్రభాస్ లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమా కాగా మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్నఆదిపురుష్ సినిమా. అయితే వీటిలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ ని ఇటీవల మూవీ యూనిట్ ప్రకటించింది.  ప్రభాస్ రాముడిగా సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడు గా నటిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 11, 2022న రిలీజ్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది.

అయితే ఇప్పుడు ఇదే కొంతవరకు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేయబోయే సినిమాకు సమస్యాత్మకంగా మారిందని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా లో హీరోయిన్ గా దీపిక పదుకొనే నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అందులో ఒక కీలక పాత్ర చేయనున్నారు. అయితే మరోవైపు తన కాల్షీట్స్ ని చాలావరకు ఆదిపురుష్ సినిమాకి కేటాయించిన ప్రభాస్ అది కొంతవరకు పూర్తయిన అనంతరం నాగ అశ్విన్ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు. ఒక రకంగా ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈ సినిమా క్యాన్సిల్ అయిందా ఏంటి అంటూ పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నారు. కాగా ఈ విషయమై ఆ మూవీ నుండి అధికారికంగా సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: