టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇక చిన్నతనంలోనే బాలరామాయణం సినిమా ద్వారా టాలీవుడ్ కి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో పెద్ద సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ ఇక అక్కడి నుండి వరుసగా ఛాన్స్ లతో మంచి విజయాలతో కొనసాగారు. ఇక తన కెరీర్ ఏడో సినిమా గా తెరకెక్కిన సింహాద్రి అతిపెద్ద విజయాన్ని అందుకొని ఆయనకు ఎంతో మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నాడు. ఆపై ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్, రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా యమదొంగ. అయితే నిజానికి యమదొంగ ముందు ఎంతో బొద్దుగా లావుగా ఉన్నారు ఎన్టీఆర్.

కాగా తన శరీర బరువుని బాగా తగ్గించి  స్లిమ్ గా అయిన తర్వాతనే యమదొంగ సినిమా షూటింగ్ మొదలు పెడదాం అని ఎన్టీఆర్ తో రాజమౌళి చెప్పటం జరిగిందట . ఇక అదే సమయంలో రాజమౌళి చెప్పిన మాటలు జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మార్గదర్శకంగా నిలవడంతో పాటు అక్కడి నుండి కొన్ని నెలలపాటు ఎంతో కష్టపడి తన శారీరక బరువును చాలావరకు తగ్గించారు ఎన్టీఆర్. అయితే అదే సమయంలో మితంగా డైట్ తీసుకోవడం అలానే  శారీరక వ్యాయామం విషయంలో తాను ఎంతో నరకయాతన అనుభవించాను అని, కానీ అదంతా కూడా జక్కన్న నా మీద ప్రేమతో నన్ను మరింత అందంగా స్క్రీన్ పై చూపించాలని ఆలోచనతోనే చెప్పాడని భావించి కసితో శరీర బరువును తగ్గించుకున్నానని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్పటం జరిగింది. ఇక ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన యమదొంగ సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకొని పలు రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: