వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయగా పవన్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఏకే రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో ఈ కథను ఒప్పించి పెద్ద సాహసమే చేసింది..

అయితే ఈ సినిమా రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నటినుంచి లీడ్ రోల్స్ కోసం సాగిన వేట ఎంతకీ తెగలేదు. ముందు ప్రధాన పాత్రలకు ప్రచారం జరిగిన పేర్లు వేరు. చివరికేమో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ పాత్ర ఎవరిది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో రాబోతున్న సినిమా  కి హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం..ఆమె పవన్-క్రిష్ సినిమాలో కథానాయిక అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని గంటల నుంచి గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ అప్‌డేట్‌తో కూడిన హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కథానాయిక అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ.. పవన్ సరసన నిధి అనగానే జనాలకు ఏదోలా అనిపిస్తోంది. పవన్ పక్కన ఆమె మరీ చిన్నదిగా అనిపిస్తుందేమో అన్నది చాలామంది ఫీలింగ్. ఇప్పటిదాకా నిధి కూడా యంగ్ హీరోల పక్కనే కనిపిస్తోంది. గ్లామర్‌తోనే ఇప్పటిదాకా పేరు సంపాదించిన నిధికి క్రిష్ సినిమాలో నటించేంత టాలెంట్ ఉందా అన్న సందేహం కూడా కలగక మానదు. అందుకే పవన్-క్రిష్ సినిమాలో నిధి కథానాయిక అనే అప్ డేట్‌పై చాలామంది నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: