అటు తిరిగిఇటు తిరిగి ఛత్రపతి రీమేక్ సినిమా వినాయక్ చేతికి వచ్చింది. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి దర్శకత్వం చేయమని బెల్లంకొండ మొదట్లో పలువురి దర్శకులను రిక్వెస్ట్ చేయగా ఎట్టకేలకు వినాయక్ ఈ ఈ సినిమా ని ఒప్పుకున్నాడు..  తెలుగులో ఇంకా హీరోగా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోని బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటించబోతున్నాడట. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హిందీలో తీస్తాడని ముందు వార్తలొచ్చాయి. ఐతే అది నిజం కాదని సుజీతే స్వయంగా వెల్లడించాడు. మరి అతడి స్థానంలోకి వినాయక్ వచ్చాడని తెలుస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ను ‘అల్లుడు శీను’తో తెలుగులో లాంచ్ చేసింది వినాయకే. అప్పటికేి చాలా పెద్ద రేంజిలో ఉన్నప్పటికీ బెల్లంకొండ సురేష్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయన కొడుకును లాంచ్ చేయడానికి ముందుకొచ్చాడు. ఐతే ఇప్పుడు వినాయక్ అంతగా ఫామ్‌లో లేని సంగతి తెలిసిందే. ఇటీవలే చిరంజీవి తో ఓ సినిమా ప్లాన్ చేశాడు వినాయక్.. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కబోయే ఈ సినిమా నుంచి వినాయక్ తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక్కడ విచిత్రమేంటంటే మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న ‘లూసిఫర్’ రీమేక్‌కు దర్శకులుగా ప్రచారంలో ఉన్న వాళ్లే చత్రపతి సినిమా రీమేక్ కి దర్శకత్వం వహించబోయే సినిమా దర్శకులు కావడం విచిత్రం..

ఇక వరుస ఫ్లాప్ చిత్రాల్లో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. న‌భా న‌టేష్‌, అను ఎమ్మాన్యుయేల్, రాయ్‌ల‌క్ష్మీ,  సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గొర్రేల సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: