ప్రభుదేవా మొదటి వివాహం రామలతతో జరిగింది. ప్రభు-రామలతకు ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత నయనతారను ప్రేమించి పెళ్లాడేందుకు ప్రభుదేవా సిద్ధమయ్యారు. అప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకోకపోవడం వల్ల నయనతార పెళ్లికి ఆటంకం ఏర్పడింది. పెళ్లి జరక్కపోయినా లవ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట, తర్వాత వచ్చిన గొడవల కారణంగా విడిపోయింది. ఆ తర్వాత ప్రభుదేవా మొదటి భార్యనుంచి విడాకులు తీసుకుని వేరు పడ్డారు.
మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 9ఏళ్ల తర్వాత ప్రభుదేవా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన మేనకోడలినే పెళ్లాడారని ప్రచారం జరిగినా.. తనకు సేవలు చేసిన ఓ ఫిజియో థెరపిస్టును ప్రభుదేవా పెళ్లాడారని ఇప్పుడు బైటపడింది. ఇటీవలే ప్రభుదేవా గుట్టు చప్పుడు కాకుండా ఫిజియోథెరపిస్ట్ కం డాక్టర్ హిమానిని వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇద్దరూ చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇంతకుముందు నిప్పు లేని పొగలా స్ప్రెడ్ అయ్యింది. తాజాగా ప్రభుదేవా సోదరుడు ఈ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిజియోథెరపిస్ట్ హిమాని కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రభుదేవాకు చికిత్స చేస్తున్నాడు. అక్కడే వీరి లవ్ స్టార్ట్ అయింది. కొంతకాలం డేటింగ్ తర్వాత ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు.