ప్రభాస్ తో చేసిన సాహో సినిమా అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయినా నిర్మాతకి మాత్రం పెద్దగా హాని చేయలేదు. అటు హీరో ప్రభాస్ కి కూడా ఆ సినిమా వల్ల ఎలాంటి బ్రేక్ రాలేదు. అప్పటికే బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. సాహో తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ తో బిజీ అయిపోయారు. ఇప్పుడు ప్రభాస్ ని టాలీవుడ్ స్టార్ గా ఎవరూ చూడటంలేదు. బాలీవుడ్ లో కూడా అతనికి మంచి క్రేజ్ వచ్చేసింది. రాగా పోగా సాహో సినిమాతో నష్టపోయింది మాత్రం యువ దర్శకుడు సుజీత్ మాత్రమే.

సాహో తర్వాత సుజీత్ కి బాగా గ్యాప్ వచ్చింది. అప్పటికే హిట్ ట్రాక్ లో ఉన్న సుజీత్.. తన ఇమేజ్ కంటే అతి భారీ సినిమాని భుజానికెత్తుకుని ఇబ్బంది పడ్డారు. సుజీత్ చేతిలో పడే సమయానికి సాహోని అంత భారీగా తీయాలనుకోలేదు. కానీ బాహుబలి ప్రభావంతో సాహో.. అలా అలా పెరిగిపోయింది. ఆ భారాన్ని మోయలేకపోయారు దర్శకుడు సుజీత్. సుజీత్ తప్పులేకపోయినా.. భారీ అంచనాలతో వచ్చిన సాహో నిరాశపరిచింది.

సాహో సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం సుజీత్ చేతిలో సినిమా లేదు. ఇటీవలే వివాహం చేసుకున్న ఈ యువ దర్శకుడు లూసిఫర్ రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. ప్రభాస్ మూవీ తర్వాత ఏకంగా చిరంజీవి సినిమా అంటే.. సుజీత్ కి మంచి ఆఫరే దొరికిందని అనుకున్నారంతా. కానీ అది మిస్ అయిపోయింది. ఇటీవల “ఛత్రపతి” హిందీ రీమేక్ చేయాల్సిందిగా నిర్మాతలు సుజీత్ ని సంపద్రించింది కూడా నిజమే. ఐతే అది కూడా ఈయన చేయట్లేదు. ప్రస్తుతం తాను ఏ రీమేక్ సినిమా చేయట్లేదని సుజీత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఊహాగానాలకు తెరదించారు. అంటే ప్రస్తుతం సుజీత్ చేతిలో ఏ సినిమా కూడా లేదనమాట. సాహో తర్వాత హీరో ఫుల్ బిజీ అయిపోగా.. దర్శకుడు మాత్రం అవకాశాలకోసం వెదుక్కుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: