తెలుగులో ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్ అలానే మహేష్ బాబు కు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో అనుష్క కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే పొగ లేకుండా నిప్పు పుట్టదు అన్న చందాన ఈ ప్రచారం మొదలు కావడానికి ఒక ఫేక్ ట్వీట్ కారణం. 

సినిమా దర్శకుడు పరశురామ్ పేరిట ఉన్న ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ సినిమాలో అనుష్క ఒక కీలక పాత్ర పోషిస్తుందని ఈ సినిమాలో ఆమె ఒక బ్యాంకు మేనేజర్ రోల్లో నటిస్తోందని ఒక ట్వీట్ చేశారు. అంతే కాదు ఆమె ఇలాంటి నటిని తమ సినిమాలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే నిజానికి అది పరశురాం ట్విట్టర్ అకౌంట్ కాదు. కానీ చాలామంది అది నిజమేనని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలా తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా అనుష్క పేరు మహేష్ బాబు సరసన మళ్లీ వినిపిస్తోంది. 

ఇది ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు కానీ హీరోయిన్ కీర్తి సురేష్ గాని ఇద్దరు హాజరు కాలేదు, మహేష్ బాబు భార్య నమ్రత అలాగే కుమార్తె తారపూజా కార్యక్రమానికి హాజరై మహేష్ బాబు తరఫున తంతు పూర్తి చేశారు. ఇక ఈ సినిమా దర్శకుడు ఇతర నిర్మాతలు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అనుష్క గురించి దర్శకుడు లేదా సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక ప్రకటన చేసే దాకా ఈ ప్రచారం ఆగుతుందని చెప్పలేము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: