సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా రాబోతుందని గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే వుంది.అయితే ఈ సినిమా ఖచ్చితంగా వుంటుందని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు.అది కూడా 'ఆర్ ఆర్ ఆర్ ' తర్వాత వుండనుంది అని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

దాంతో రాజమౌళి మహేష్ ను ఎలా చూపిస్తాడన్నది సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ప్రకటన వచ్చినప్పటి నుండి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా ఈ సినిమాకు సంబందించి ఓ ఇంటరెస్టింగ్ వార్తా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది..సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట.

 మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: