దక్షిణాదిలోనే కాక బాలీవుడ్లోనూ కొన్ని సినిమాలు ఒప్పుకుని పూజా హెగ్డే బిజీబిజీగా ఉంది. ఈమె ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో మొదటి సినిమా ప్రభాస్ రాధేశ్యామ్ కాగా మరో సినిమా అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్ మీద ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సినీ తెరంగ్రేటం చేశాక ఇప్పటి దాకా హిట్ లేక కరువు మీద ఉన్న అఖిల్ ఎలా అయినా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది ఎలా అయినా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్ లో కరోనా కలకలం రేగింది అని అంటున్నారు. అయితే దానికి కారణం కూడా పూజ హెగ్డే అట. ఇంతకీ విషయంలోకి వెళ్తే పూజా హెగ్డేసినిమా షూటింగ్ లో ఉండగా జలుబు జ్వరం మొదలైందట. దీంతో యూనిట్ మొత్తానికి కరోనా టెన్షన్ పట్టుకుంది ఎందుకంటే ఈమె వరుస షూటింగ్స్ చేస్తూ వెళుతోంది, 

మొన్నటికి మొన్న షూటింగ్ పూర్తిచేసుకుని ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చింది. అదీగాక డైరెక్ట్ గా హైదరాబాద్ రాకుండా ముంబైలోని ఇంటికి వెళ్లి మళ్లీ ఇక్కడికి రావడం తో ఎక్కడైనా ఈమెకు కరోనా సోకిందా ఏంటి ? అనే అనుమానాలు మొదలయ్యాయి, అయితే పరీక్ష చేయించుకోగా అందుకే ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. సో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఈ భామ ముంబైలోని ఇంటికి చెక్కేసిందట. ఏదైతేనేమి యూనిట్ మొత్తాన్ని టెన్షన్ పెట్టిన పూజా హెగ్డే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: