ఈ లెక్క తెలుసు కాబట్టే మేకర్స్ ఎక్కడెక్కడి నుంచో సోయగాల భామలను తీసుకువచ్చి మరీ తెలుగులో స్టెప్పులేయిస్తారు. ఇలా బాలీవుడ్ భామలు రేసులో ముందుండి చాన్సులు కొట్టేస్తే ఆ తరువాత వాటా కేరళ కుట్టీలదే. నయన తార నుంచి మొదలుపెడితే అనుపమ పరమేశ్వరన్ వరకూ అందరూ మళయాళీ భామలే.
వీరందరికీ మదర్ స్టేట్ లో కంటే కూడా బయట ఆదరణే ఎక్కువ. ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రేమమ్ మూవీలో ఒక హీరోయిన్ గా మెరిసి, శతమానం భవతి మూవీతో హీరోయిన్ గా సక్సెస్ అయిన అనుపమ పరమేశ్వరన్ అందానికి లోటు లేదు. ఇక ఆమెకు సరైన పాత్రలు వస్తే నటన చూపించేందేమో. కానీ ఆ చాన్స్ లేకుండానే ఆమెకు వరస ఫ్లాప్స్ వచ్చాయి.
మిడిల్ రేంజి హీరోల పక్కన ఆమె చేసిన సినిమాలు ఉన్నది ఒక్కటే జిందగీ, హెలో గురూ ప్రేమ కోసమే, క్రిష్ణార్జున యుధ్ధం వంటి మూవీస్ వరసగా ఫ్లాప్ అయ్యాయి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన రాక్షసుడు హిట్ అయింది. దాంతో ఆమెకు మళ్ళీ టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ టూ మూవీని స్టార్ట్ చేశాడు. అందులో అనుపమను హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే నిఖిల్ మరో మూవీలోనూ ఈ అమ్మడే హీరోయిన్ అంటున్నారు. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు తీయబోయే మరో మూవీ, దిల్ రాజు బ్యానర్ లో కూడా అనుపమకు అవకాశాలు దక్కాయి. మొత్తానికి చూసుకుంటే లాక్ డౌన్ తరువాత మరింత క్యూట్ గా తయారైన అనుపమ ఇపుడు టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిందని చెప్పాలి.