చివరిగా రాక్షసుడు అనే సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ ఇప్పుడు అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇది ఎందుకు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియదు గాని ఈయన ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు అంటూ ఒక పుకారు మొదలైంది. మొదలైన మూడు నాలుగు రోజులు అవుతుంది కూడా. ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారు అనే విషయం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. తాజాగా ఈ సినిమాను ఈ సాహో దర్శకుడు సుజిత్ బాలీవుడ్లో తెరకెక్కించనున్నాడని ప్రచారం జరిగింది. 

ఆయన ప్రభాస్ తో తీసిన సాహో సినిమా బాలీవుడ్ లో బాగానే అవడంతో ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఆయనకు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్ళీ ఈ సినిమా వినాయక్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. నిజానికి వినాయక్ లూసిఫర్ రీమేక్ నుంచి తప్పుకున్నాడు. సో ఆయన ఖాళీగా ఉండడంతో ఈ సినిమాని ఆయన చేత చేయించాలని బెల్లంకొండ భావిస్తున్నాడట. ఎందుకంటే ఆయన మొదటి సినిమా చేసింది వినాయక్ తోటే. 

అల్లుడు శీను పేరుతో రిలీజ్ అయిన సినిమా ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. హీరోయిజం జాడలు ఏమాత్రం లేని బెల్లంకొండ ఒక హీరోలా స్థాపించడానికి వినాయక్ చాలా కష్టపడ్డాడు. సో తన బాలీవుడ్ అవకాశం కూడా వినాయక్ కే అప్పజెప్పాలని ఈయన భావిస్తున్నాడట. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా గురించి వినాయక్ కానీ బెల్లంకొండ కానీ క్లారిటీ ఇస్తే తప్ప ఎటువంటి పుకార్లు నమ్మలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: