ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ నటుడు తరుణ్ బాలనటుడిగానే అందరినీ మెప్పించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ‘నువ్వే కావాలి’ సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అమ్మాయిలకి లవర్ బాయ్ అయిపోయాడు. తరువాత వరుసగా లవ్ స్టోరీస్ చేసుకుంటూ అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అప్పట్లో యూత్‌లో తరుణ్‌కి స్టార్ హీరోలను మించి క్రేజ్ ఉండేది. హిట్లతో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోగా ఎదిగాడు. అయితే ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా తరుణ్ కెరీర్‌ పడిపోయింది. అదే సమయంలో 2005లో ‘నవ వసంతం’ అనే సినిమా చేశాడు. అందులో ప్రియమణి హీరోయిన్. ఆ సమయంలోనే ప్రియమణి, తరుణ్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు రూమర్లు వచ్చాయి.


ఆ విషయం గురించి ఈ మధ్య  ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ...‘‘నవ వసంతం’ సినిమా చేస్తున్న సమయంలో తరుణ్, నేను ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని వార్తలొచ్చాయట. ఈ విషయం తెలుసుకున్న తరుణ్ అమ్మ రోజా రమణి గారు షూటింగ్ స్పాట్‌కి వచ్చి నన్ను కలిశారు. ‘మీరిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా?.. అదే నిజమైతే మీ పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఉంటే సంకోచించకుండా చెప్పేయండి’... అని అన్నారు. ఆమె చెప్పేంతవరకు మా గురించి ఆ విధంగా ప్రచారం జరుగుతోందని నాకు తెలీదు. ఒకే హీరోతో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తేనే ఇలాంటి ప్రచారం జరుగుతుంది. కానీ మేమిద్దరం కలిసి ఒక్క సినిమాలోనే నటించాం. అయినప్పటికీ మా గురించి పుకార్లు రేపారు’ అని ప్రియమణి చెప్పారు.చాలాకాలంగా వెండితెరకు దూరమైన తరుణ్ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ సంస్థ ద్వారా స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ముందుగా ఓ వెబ్ సిరీస్‌ తీసి.. ఆ తర్వాత సినిమా రంగం వైపు వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు త్వరలోనే తరుణ్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. రోజా రమణి బెస్ట్ ఫ్రెండ్‌ కూతురితో పెళ్లి ఫిక్స్ అయిందని, ఆమె ఇటీవలే విదేశాల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి వచ్చినట్లు సమాచారం.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: