దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కొమురం భీం ఇంట్రో టీజర్ విడుదల చేసి వారిలో ఆనందాన్ని నింపాడు జక్కన్న. ఆ టీజర్ యూట్యూబ్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. టీజర్ వచ్చిన కొద్ది సమయంలోనే ఏకంగా 1మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్న ఏకైక తెలుగు టీజర్ గా ఎన్టీఆర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు దాంతో rrr టీం కి ఈ టీజర్ మాంచి జోష్ ని ఇచ్చింది. ఇక ఇటీవలే మళ్ళీ షూటింగ్ ని మొదలు పెట్టి శరవేగంగా జరుగుపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది ...

ఇక తాజాగా ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న హాలీవుడ్ నటులు అలిసన్ డుడి, రే స్టీవెన్ సన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. వారిద్దరికీ సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. rrr సెట్ లో వీరిద్దరూ జాయిన్ అయినట్లు స్వయంగా ప్రకటించింది చిత్ర యూనిట్.ఇక ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో పాటు ఈ ఇద్దరి పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.ఇక ఇటీవలే ఎన్టీఆర్సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి.. తన ఫ్యామిలీతో సరదాగా గడపడానికి దుబాయ్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తారక్ మళ్ళీ యధావిధిగా rrr షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

 ఇదిలా ఉంటే ఈ సినిమాలోఎన్టీఆర్ కి జోడిగా మరో హాలీవుడ్ నటి అయిన ఒలివియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమె ఈ సినిమా షూటింగ్ లో ఇంకా జాయిన్ కాలేదు. ఐతే ఈమె rrr  షూటింగ్ లో ఇంకెప్పుడు పాల్గొంటుందని టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఐతే ప్రస్తుతం ఫిలిం నగర్ నుంచి అందుతున్నసమాచారం ప్రకారం ముందుగా rrr విలన్స్ పార్ట్ షూటింగ్ అయిపోయాక.. ఆ తర్వాత ఎన్టీఆర్, ఒలివియా ల కాంబినేషన్ సీన్స్ ని షూట్ చేయబోతున్నాడాట జక్కన్న. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్న రాజమౌళి వచ్చే ఏడాది విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: