నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కు బాలకృష్ణ కు మంచి సాన్నిహిత్యం ఉంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆదిత్య 369’ ‘వంశానికొక్కడు’ ‘భలేవాడివి బాసూ’ ‘మిత్రుడు’ వంటి చిత్రాలు వచ్చాయి. దాంతో నిర్మాత బాలయ్యను సంప్రదించగా ఆయన ఓ కండిషన్ పెట్టారట. బాలయ్య పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఎక్కువ స్క్రీన్ టైం నాగ శౌర్యకు మాత్రమే ఉంది కాబట్టి, ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఆయన అభిమానులు ఫీలవుతారని బాలయ్య తెలిపాడట. ఈ చిత్రంలో నటించాలి అంటే నేనడిగినంత పారితోషికం ఇవ్వాలని కండిషన్స్ పెట్టాడట.
బాలయ్య చెప్పిన రేటు నిర్మాతకు నచ్చకపోవడంతో లైట్ తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం నిర్మాత చూపు వెంకటేష్ పై పడిందని సమాచారం అందుతుంది. మరి వెంకటేష్ అంగీకరిస్తాడో లేదో.. తెలియాల్సి ఉంది. ఇక యంగ్ హీరో నాగ శౌర్య ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలకు కూడా ఓకే చెప్పటం జరిగింది.ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...