ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రధాన విలన్ అయిన అధీరా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా సినిమాలో మరొక కీలక పాత్ర అయిన రమిక సేన్ క్యారెక్టర్ లో బాలీవుడ్ నటి రవీనా టండన్ నటిస్తోంది. మొదటి భాగం కంటే కూడా మరింత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు ఆయన ప్రభాస్ లేదా మహేష్ బాబు తో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
అయితే ప్రశాంత్ నీల్ టాలీవుడ్లో పక్కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనుంది మాత్రం వాస్తవం అని కానీ ఈ ముగ్గురిలో ఏ హీరో అందులో నటిస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉందని అంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. కొన్నాళ్ళ క్రితం ప్రత్యేకంగా మహేష్ ని కలిసిన ప్రశాంత్ ఆయనకు ఒక స్టోరీ లైన్ వినిపించారని అది ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నారట ప్రశాంత్. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్నఈ వార్త కనుక నిజమైతే మాత్రం తొలిసారిగా సూపర్ స్టార్, ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ సినిమాని ఆశించవచ్చు....!!