మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా అరవింద సమేత. మంచి యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక దాని తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అలవైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని అందుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే ల కలయికలో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించగా గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాయి.

ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ దాని అనంతరం మరొకసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పని చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేయనున్నారని ఇప్పటికే ఆయా హీరోల సినిమాలకు సంబంధించిన కథలను కూడా పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ నిమగ్నమై ఉన్నారని కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

అయితే త్రివిక్రమ్ తదుపరి సినిమా మాత్రం పక్కాగా ఎన్టీఆర్ తోనే ఉంటుందని కానీ ఆ తర్వాత మాత్రం ఆయన చేయబోయేది ఒక యువ హీరోతో అని సమాచారం. ఇప్పటికే ఆ యువ హీరోకి ఒక స్టోరీ లైన్ వినిపించిన త్రివిక్రమ్ అది అతడికి ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనం ప్రకారం ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ నిజంగానే ఆ యువ హీరోతో సినిమా చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: