సూపర్ స్టార్ మహేష్ బాబు కొందరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అంటే అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉంటాయి.అటువంటి దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు.ఈయనతో మహేష్ "మహార్హి " వంటి బ్లాక్ బాస్టర్ తీశాడు.ఈ సినిమా మహేష్ కెరియర్ లో మైలు రాయి గా నిలిచింది.అయితే ఈ సినిమా తర్వాత వంశీకి మరొక ఛాన్స్ ఇస్తానని మహేష్ మాట ఇచ్చాడు.

అయితే అనూహ్యంగా ఈ దర్శకునితో సినిమా క్యాన్సిల్ అయింది.మహేష్  ప్రస్తుతం “సర్కారు వారి పాట” చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇక ఈ చిత్రం అనంతరం మహేష్ దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ దానిని టేకప్ చేసే లోపే ఒకటి రెండు సినిమాలు చేస్తారని టాక్ వినిపించింది.అయితే ఈ నేపథ్యంలో మహేష్ నెక్స్ట్ ఎవరితూ చేస్తారు అన్న విషయంలో టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

కానీ ఈ రేస్ లో మాత్రం మహేష్ టాప్ దర్శకుడు లేడనే సమాచారం. అతడే వంశీ పైడిపల్లి..కానీ వీరి కాంబో మళ్ళీ సెట్టవుతుందని అనుకుంటూనే పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అది కాస్తా మరింత దూరం వెళ్ళిపోయినట్టు సమాచారం. మహేష్ నెక్స్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోనే చెయ్యడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మరి వీరి కాంబోపై మరింత సమాచారం రావాల్సి ఉంది.మరి మహేష్ , వంశీ పైడిపల్లి కాంబినేషన్ ఎప్పటికీ కుదిరెనో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: