సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కు ముందు మహేష్ స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. వంశీ స్టోరీ నచ్చినా సరే ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. వంశీ పైడిపల్లికి మహేష్ హ్యాండ్ ఇవ్వగానే రాం చరణ్ కు కథ వినిపించాలని చూశాడు వంశీ పైడిపల్లి. ఎవడు సినిమాకు వీరిద్దరు కలిసి పనిచేశారు.

అయితే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఈ సినిమా తర్వా వంశీ పైడిపల్లితో చేసేందుకు అంత సుముఖంగా లేడని తెలుస్తుంది. చరణ్ మీద పెట్టుకున్న హోప్ కూడా నీరుగారడంతో మళ్లీ వంశీ పైడిపల్లి మహేష్ తోనే సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది. మహేష్ తో వంశీ మహర్షి లాంటి అద్భుతమైన సినిమా చేశాడు. అయితే ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందని ఆశించగా ఎందుకో మళ్లీ వెనక్కి తగ్గారు.

ఎలాగోలా మహేష్ ను మెప్పించి తనతో సినిమా చేయాలని చూస్తున్నాడు వంశీ పైడిపల్లి. పరశురాం సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా కన్ ఫాం అయ్యింది. ఈ సినిమాకు లేట్ ఉంటే కనుక సర్కారు వారి పాట తర్వాత మహేష్సినిమా చేస్తాడు అది వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఉంటుందా లేక త్రివిక్రం డైరక్షన్ లో ఉంటుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి తో మహేష్ చేస్తే మాత్రం ఈసారి మహర్షిని మించే సినిమా వస్తుందని అంటున్నారు. స్టోరీ లైన్ ఎలాగు నచ్చింది కాబట్టి మహేష్ చెప్పిన మార్పులతో వంశీ త్వరలోనే సూపర్ స్టార్ ను కలిసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.                



 

మరింత సమాచారం తెలుసుకోండి: